కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి వైకుంఠం నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు తొలిపాదం మోపిన ప్రాంతం వేదగిరి అన్నారు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ఇక్కడ కొనేర్లు, గిరిప్రదక్షిణ చేసే ప్రాంత అభివృద్ధి, దశావతారాల వద్ద అభివృద్ధి చేసేలా ఆడిగాం. నా ప్రయత్నంలో నాకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఉషమ్మ, దీపా వెంకట్, డిఫెన్స్ అడ్వైజర్ సతీష్రెడ్డి, అప్పటి కలెక్టర్ చక్రధర్ బాబు ఎంతగానో సహకరించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి గుర్తు చేశారు. గణేష్ ఘాట్, ఎన్టీఆర్, నెక్లెస్రోడ్డు, ఇరుకళల పరమేశ్వరి ఆలయం, భారా షాహిద్ దర్గా అభివృద్ధి కోసం స్వదేశీ దర్శన్ స్కీం కింద 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని కిషన్రెడ్డిని కోరుతున్నామని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అన్నారు.
పూర్తిగా చదవండి..AP: కోటంరెడ్డికి కోపం వచ్చింది.. ఆ పనులు చేయాలంటూ ఆగ్రహం
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. నరసింహకొండ వేదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పథకం కింద ఎంపి అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని రూరల్ ఎమ్మెల్యే వెల్లడించారు.
Translate this News: