పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లి స్మశాన వాటిక వద్ద సుమారు 50 కోతులు విగత జీవులుగా పడిపోయి ఉన్నాయి. అయితే వీటిపై విష ప్రయోగం జరిగిందా..? లేదా వీటిని చంపి వేరే ప్రదేశం నుంచి ఇక్కడికి తీసుకువచ్చి పడేశారా..? అన్న కోణంలో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కోతులను చంపడం చాలా విషాదకరమైన సంఘటనాని ప్రజలు అంటున్నారు. దుబ్బపల్లి సర్పంచ్ శ్రవణ్ జేసీబీ సహాయంతో కోతులను పూడ్చేశారు. పోలీసులు ఫారెస్టు సిబ్బంది వెటర్నరీ వైద్యులచే శవపంచనామా నిర్వహించారు. వనాలు అంతరించిపోవడంతో వానరాలు గ్రామాల్లో సంచరిస్తున్నాయని, మూగజీవాలను చంపి వేయడం చాలా హేయమైన చేర్య అని అన్నారు. ఏది ఏమైనా మూగజీవాలను చంపడం చాలా బాధాకరమని దోషులను గుర్తించి వారిపై తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
పూర్తిగా చదవండి..Peddapalli: పెద్దపల్లిలో దారుణం.. వానరాల ఉసురు ఊరికే పోదు!
పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు సుమారు 50కి పైగా కోతులను చంపి పారేశారు. కొండలు అంతరించి పోవటంతో వానరాలు తిండి కోసం గ్రామలకు వస్తున్నాయి. చనిపోయిన కోతులను చూసి స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే స్థానిక సర్పంచ్ శ్రావణ్కు సమాచారం ఇచ్చారు. సర్పంచ్ సంబంధిత ఫారెస్ట్ అధికారులకు తెలిపారు.
Translate this News: