చదువుకునే పిల్లలకు పాఠశాలలో రోజురోజుకు భద్రత కరువు అవుతుంది. విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను సక్రమమైన మార్గంలో పెట్టాల్సిన టీచర్లు.. కొందరు ఉపాధ్యాయులు కామాంధులుగా మారి విద్యార్థులను లైంగిక వేధింపులకు గిరి చేస్తున్నారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిచిన ఘటన ఓ స్కూల్ వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే… కీచక టీచర్కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురంలో చోటుచేసుకుంది. పిఠాపురం ఆదిత్యలో స్కూల్లో కీచక ఉపాధ్యాయుడు బాలికల పట్ల లైంగిక వేధింపులకు గుర్తిచేస్తున్నాడు. విద్యార్థినిలు మానసికంగా కుంగిపోతున్నారు. విషయం బయటకు పొక్కడంతో తల్లిదండ్రులు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి’చేశారు. రెండు నెలలుగా విద్యార్థినుల పట్ల ఆసభ్యంగా ప్రవర్తన, ఏడవ తరగతి విద్యార్థిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సోషల్ టీచర్ దుర్గారావు. లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని విద్యార్థిని తల్లి ప్రిన్సిపాల్, ఇతర టీచర్లకు ఫిర్యాదు చేశారు. పాఠశాల యాజమాన్యం సరిగా స్పందించకపోవడంతో.. విద్యార్థిని బంధువుల పట్ల దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థిని కుటుంబసభ్యులు, బందువులు పాఠశాల దగ్గర అందోళన చేశారు.
పూర్తిగా చదవండి..Pithapuram: కీచకుడిగా మారిన టీచర్… బుద్ధి చెప్పిన పేరెంట్స్
కాకినాడ పిఠాపురంలో ఓ కీచక టీచర్కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు. బాలికలను లైంగికంగా వేధించాడని ఉపాధ్యాయుడిపై ఆరోపణలు వచ్చాయి. సోషల్ టీచర్ దుర్గారావు రెండు నెలలుగా విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విషయం బయటకు రావడంతో తల్లిదండ్రులందర అందరూ కలిసి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Translate this News: