England vs NZ: ప్రపంచంలోనే అత్యధిక సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం నరేంద్ర మోదీ గ్రౌండ్. అందుకే వరల్డ్ కప్(World cup) తొలి మ్యాచ్ అక్కడ నిర్వహించింది బీసీసీఐ(BCCI). 2019 వరల్డ్ కప్ ఫైనలిస్టులు ఇంగ్లండ్, న్యూజిలాండ్ మ్యాచ్కు టికెట్లు అమ్ముడుపోలేదు. దీంతో ఫ్రీ టికెట్లు ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. 40వేల మంది మహిళలు స్టేడియానికి వస్తారని ప్రచారం చేశారు. అయితే సీన్ చూస్తే మాత్రం ప్రేక్షకుల సంఖ్య నిల్గా కనిపిస్తోంది. అక్కడఅక్కడ కొంతమంది అభిమానులు కనిపిస్తున్నారనే కానీ అసలు వరల్డ్కప్ ఫస్ట్ మ్యాచ్ అన్న ఫీల్ ఎక్కడా కనిపించడంలేదు. ఆ వచ్చిన ఫ్యాన్స్ కూడా ‘మోదీ మోదీ’ అని నినాదాలు చేస్తుండడం షాక్కి గురిచేస్తోంది. ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ ఆడుతుంటే మధ్యలో మోదీ నినాదాలు ఎందుకో అర్థం అవ్వక ఫ్యాన్స్ జుట్టు పీక్కుంటున్నారు. బీసీసీఐపై మండిపడుతున్నారు. వరల్డ్కప్ని ఇలానేనా ఆర్గనైజ్ చేసేది అని ఫైర్ అవుతున్నారు. అసలే క్రికెట్ని మతంగా భావించే దేశం మనది. ఏ చిన్న తప్పు జరిగినా ఫ్యాన్స్ ఒప్పుకోరు. అయినా కూడా బీసీసీఐ నిర్లక్ష్యంగా వ్యవహరించిందానన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పూర్తిగా చదవండి..World Cup 2023: సీట్లపై కాకి రెట్టలు.. ఫ్యాన్స్కి ఒళ్లు మండేలా చేసిన బీసీసీఐ.. ఫస్ట్ మ్యాచ్ తుస్సు!
ప్రపంచ కప్ ప్రారంభం అయ్యింది. కానీ ఆ కిక్ మాత్రం ఎక్కడా కనపడడంలేదు. తొలి మ్యాచ్కు ఆతిథ్యమిస్తోన్న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ప్రేక్షకులు లేక బోసిపోయింది. లక్షకు పైగా సీటింగ్ కెపాసిటీ ఉన్న స్టేడియం ఇది. మహిళలకు ఫ్రీ టికెట్లు కూడా ఆఫర్ చేసినా ఎవరూ స్టేడియంవైపు రాలేదు. వరల్డ్కప్ ఫస్ట్ మ్యాచ్ని ఇలాగేనా నిర్వహించేదని బీసీసీఐపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: