హనుమకొండ జిల్లాలో నడికూడా మండలాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలంలో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని మరియు బస్ స్టేషన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ నేతలు అవే హామీలను తెలంగాణలో ప్రచారం చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నారని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మొద్దని సూచించారు. సీఎం కేసీఆర్ పథకాల్ని పెంచి ఇస్తామని అర్రాసు పాట హామీలు ప్రకటిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఇవ్వని పార్టీ.. తెలంగాణ ఎలా ఇస్తుందని ధర్మారెడ్డి ప్రశ్నించారు. రైతులను అరిగోస పెట్టిన కాంగ్రెస్ను నమ్మితే మోసపోతామన్నారు.
పూర్తిగా చదవండి..Telangana Politics: సీఎంగా కేసీఆర్నే ఆశీర్వదిస్తారు: ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
హనుమకొండ జిల్లాలో నడికూడా మండలాలలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ మోసపూరిత మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడ్డ నడికూడ మండలంలో నిర్మించిన నూతన తహశీల్దార్ కార్యాలయాన్ని మరియు బస్ స్టేషన్ని పరకాల శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు.
Translate this News: