తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి లోకేష్ క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేరుకున్నారు. శుక్రవారం చంద్రబాబుతో ములాఖాత్ అయ్యి హైదరాబాద్ వెళ్ళి, ఈరోజు తిరిగి వచ్చిన బ్రాహ్మణి చేరుకున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రేపు రాజమండ్రిలో భువనేశ్వరి దీక్ష చేయనున్నారు. రేపు గాంధీ జయంతి రోజున ఒకరోజు నిరసన దీక్ష చేపట్టాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి-భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కలిశారు. కాగా.. ఈ నిరసన దీక్షలు రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..AP Politics: ప్రజల డబ్బుతో జగన్ రాజకీయం: యనమల ధ్వజం
స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్టును నిరసిస్తూ చంద్రబాబుతో పాటు కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు దీక్షలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నారా భువనేశ్వరి, రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు, ఢిల్లీలో నారా లోకేష్ ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నారు. లోకేష్ క్యాంపు కార్యాలయానికి భువనేశ్వరిని పలువురు టీడీపీ నేతలు కాలిశారు.
Translate this News: