Errabelli Dayakar Rao: కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని తెలంగాణ మంత్రి దయాకర్ రావు(Errabelli Dayakar Rao) అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ కష్టాలు తప్పవని అన్నారు. రైతుల నడ్డి విరవడానికి 3 గంటల కరెంటు చాలంటోందని.. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంట్ ఇచ్చే బిఆర్ ఎస్ కావాలో మీరే తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఎప్పుడూ ముఖం తెలియని వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారని..అయితే ఈ ఎన్నికలు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయన అన్నారు. మీ కష్టాల్లో సుఖాల్లో కేసీఆర్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సారి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కు మద్దతు తెలపాలని ప్రజలను కోరారు.
పూర్తిగా చదవండి..Errabelli Dayakar Rao: ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే..! : మంత్రి దయాకర్ రావు
కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లేనని మంత్రి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. 3 గంటల కరెంటు కావాలా? లేదంటే 3 పంటల కరెంటు కావాలా? మీరే తేల్చుకోండి అంటూ వ్యాఖ్యనించారు. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: