హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాటాన్ని తెలంగాణ ప్రజలు స్పూర్తిగా తీసుకుంటున్నారన్నారు. నిజాం నిరంకుశ పాలనపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం మరువలేనిదన్నారు. ఒకవైపు స్వాతంత్య్రం కోసం పోరాటం జరుగుతుంటే.. మరోవైపు నిజాం నిరంకుశ వ్యతిరేక పాలన సాగిందన్నారు. అలాంటి సమయంలో వరంగల్ పాలకుర్తి ప్రాంతాల్లో నిజాం దొరల పెత్తందారుల దోపిడీపై చాకలి ఐలమ్మ చేసిన పోరాటం గొప్పదన్నారు.
పూర్తిగా చదవండి..BJP: బీజేపీ హెడ్ ఆఫీస్లో చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.
Translate this News: