కలియుగ దైవంగా భక్తులు నమ్మి కొలిచే ఏడుకొండల వాడైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. సోమవారంతో వాహన సేవలు అత్యంత వైభవంగా ముగిశాయి. మంగళవారం చివరిరోజైన పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం వేడుకగా జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, ఈవో ధర్మారెడ్డి పాల్గొంటారు. ఇవాళ సాయంత్రం ధ్వజావరోహణంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి.
పూర్తిగా చదవండి..tirumala: నేటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు..చక్రస్నానం ప్రత్యేకతలు తెలుసా..!!
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. శ్రీవారిని వాహన సేవను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చారు. ఇక బ్రహ్మోత్సవంలో భాగంగా నిన్న రథోత్సవంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి అనుగ్రహం ఇచ్చారు. భక్త జనసందోహం నడుమ రథోత్సవం ఘనంగా మొదలై.. రథంపై ఉరేగిస్తూ తిరుమాడవీధుల వెంట స్వామివారిని తిప్పారు. గోవింద.. గోవిద.. నామ స్మరణతో ఆ ప్రాంగణం మారుమోగింది.
Translate this News: