చంద్రబాబుకు మద్దతు తెలిపేందుకు భువనేశ్వరి కలిసేందుకు హైదరాబాద్ ఐటీ ఉద్యోగుల ఆధ్వర్యంలో కార్లతో భారీగా వెళ్తున్నారనే సమాచారంతో రాజమండ్రిలో పోలీసులు హైఅలర్ట్ అయ్యారు. ఐటీ ఉద్యోగులు చలో రాజమండ్రి పిలుపు నేపథ్యంలో లోకేష్ క్యాంప్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాలలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకుంటున్నారు. వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే వాహనాలు ముందుకు పంపిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Rajahmundry: రాజమండ్రిలో హై అలర్ట్.. అసలేం జరుగుతోందంటే..?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. హైదరాబాద్ ఐటీ కంపెనీ ఉద్యోగులు ‘చలో రాజమండ్రి’ కార్యక్రమం నేపథ్యంలో భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ హైదరాబాద్ నుంచి తరలి వెళ్తున్నారు. దీంతో ఏపీ పోలీసులు హై అలర్ట్ అయ్యారు.
Translate this News: