కాకినాడ జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. జగ్గంపేట మండలం సీతారాంపురం గ్రామంలో విద్యుత్ షాక్తో ముగ్గురు వ్యక్తులు మరణించారు. గ్రామంలోని పామాయిల్ తోటలో బోరు కొట్టేందుకు పనులు చేస్తున్న తరుణంలో పైన విద్యుత్ లైన్ యొక్క వైర్లను పైపులు తాకిన్నాయి. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే ముగ్గురు కూలీలు దుర్మరణం అయ్యారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, బూరుగుపూడి కిల్లినాగు, గల్లా బాబి(నాగరాజు)గా గుర్తించారు. మృతులను బోదిరెడ్డి సూరిబాబు (35), కిల్లినాడు (40), గల్ల బాబీ (24) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్త దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న జగ్గంపేట పోలీసులు, సంఘనాస్థలిని పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kakinada: ఏపీలో విషాదం.. విద్యుత్ షాక్తో ముగ్గురు మృతి
తెలుగు రాష్ట్రాల్లో విద్యుదాఘాతానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా పలువురు బలి అవుతున్నారు. ఒక ఘటన మర్వకముందే మరో ఘటన చోటు చేసుకుంటుంది. ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్తు చార్జీలు పెంచడానికి వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో మహాధర్న చేపట్టాలని నిర్ణయిస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలోని సీతారాంపురంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో ప్రతిపక్షాలు ఏం చేస్తారో చూడాలి.
Translate this News: