లోక్సభ, రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33శాతం సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్సభ ఆమోదించింది. బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు పడగా.. వ్యతిరేకంగా 2 ఓట్లు పడ్డాయి. MIM పార్టీ ఈ బిల్లును వ్యతిరేకించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్యలున్నాయి. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరిపారు. ఓటింగ్ స్లిప్పులను సిబ్బంది పంచారు, 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఇక బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. బిల్లుపై 60 మంది ఎంపీలు తమ అభిప్రాయాన్ని సభ వేదికగా చెప్పారు. కొత్త పార్లమెంట్లో పాస్ అయిన తొలి బిల్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లు నిలిచిపోనుంది.
డీలిమిటేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ బిల్లు అమలు కానుంది.
BIG BREAKING: లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం..!
లోక్సభలో మహిళా బిల్లుకు ఆమోదం లభించింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానంలో సాంకేతిక సమస్యలున్నాయి. స్లిప్పుల ద్వారా ఓటింగ్ జరిపారు. ఓటింగ్ స్లిప్పులను సిబ్బంది పంచారు, 8 గంటల పాటు సుదీర్ఘంగా చర్చ సాగింది. ఇక బిల్లుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు. 2029 ఎన్నికల్లోనే రిజర్వేషన్లు అమలు చేస్తామని స్పష్టం చేశారు. అటు బిల్లు అసంపూర్తిగా ఉందని విపక్షాల విమర్శలు చేస్తున్నాయి. బిల్లుపై 60 మంది ఎంపీలు తమ అభిప్రాయాన్ని సభ వేదికగా చెప్పారు.
Translate this News: