జనాభా పరంగా కాపులకు ఏపీలో అతిపెద్ద ఓటు బ్యాంక్ ఉంది. ఈ కులాన్ని ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు తమదైన శైలిలో వ్యూహాన్ని రచిస్తుంటాయి. 2019అసెంబ్లీ ఎన్నికల్లో కాపులు వైసీపీ పక్షానే నిలపడ్డారు. వచ్చేసారి ఎవరికి సపోర్ట్ ఇస్తారో ఇప్పటికైతే తెలియదు కానీ కాపు కులానికి చెందిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కమ్మ కులానికి చెందిన చంద్రబాబునాయుడు పార్టీకి నేరుగా సపోర్ట్ ఇవ్వడాన్ని కొంతమంది కాపు నేతలు వ్యతిరేకిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Kaapu politics: రంగా లక్ష్యాలను, ఆశయాలను తాకట్టు పెట్టారు.. పవన్కి వ్యతిరేకంగా విజయవాడలో మీటింగ్!
రంగా లక్ష్యలను, ఆశయాలను తాకట్టు పెడుతున్నారని.. పవన్కు చురకలంటించే విధంగా విజయవాడ ఐలపురం కన్వేన్షన్ సెంటర్లో వంగవీటి రంగ, రాధ అభిమానుల ఆత్మీయ సమావేశం జరిగింది. రంగా ఆశయాలను, లక్ష్యాలను గౌరవించే రక్తసంబంధీకులు ఎవరు ఉన్నా వారితో కలిసి పనిచేస్తామని.. ఆయన వారసులమని చెప్పుకొని.. ఆ మహనియుడి ఆశయాలకు లక్ష్యాలకు వ్యతిరేకంగా ఉన్న రక్త సంబంధువులు ఎవరైనా వారిపై పోరాడుతామని చెప్పారు. ఇది పరోక్షంగా రంగా తనయుడు రాధకి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యాఖ్యలేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Translate this News: