బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు అందిచే దళితబంధు, నిరుపేద బీసీలకు అందించే బీసీ బంధు పథకాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోతలు విధిస్తున్నారని ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నకిరేకల్ నియోజకవర్గంలో 556 దళిత కుటుంబాలకు గాను ప్రభుత్వం కేవలం 12 కుటుంబాలకే దళిత బంధు ఇచ్చారన్నారు. కానీ ఆ 12 కుటుంబాలకు చేరే దళిత బంధులో సైతం స్థానిక నేతలు కమీషన్ల రూపంలో బాధితుల నుంచి డబ్బులు తీసుకున్నారని మండిపడ్డారు.
పూర్తిగా చదవండి..MP Venkat Reddy: బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైంది
బీఆర్ఎస్పై కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల దోపిడీ ఎక్కువైందన్నారు.
Translate this News: