నిత్యం బిజీబిజీగా గడిపే ప్రధాని మోదీ ఇప్పుడు మరింత బిజీ అయ్యారు. రేపు, ఎల్లుండి జీ20 సమ్మిట్ ఉండడంతో మోదీ షెడ్యూల్ చాలా టైట్ అయ్యింది. ఈ సమ్మిట్కి హాజరయ్యేందుకు ప్రపంచ దేశాధినేతలు, ప్రముఖులు వస్తుండడంతో వారితో భేటీకి మోదీ సిద్ధమయ్యారు. ప్రపంచ నేతలతో ఈ మూడు రోజుల్లోనే మోదీ 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 8(ఇవాళ) మారిషస్, బంగ్లాదేశ్, అమెరికా నాయకులతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. రేపు(సెప్టెంబరు 9న).. జీ20 సమావేశాలతో పాటు, UK, జపాన్, జర్మనీ, ఇటలీతో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. ఎల్లుండి(సెప్టెంబర్ 10) ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ప్రధాని లంచ్ మీటింగ్ ఉంది. కెనడాతో పుల్-అసైడ్ మీటింగ్, కొమొరోస్, టర్కీ, యూఏఈ(UAE), దక్షిణ కొరియా, EU/EC, బ్రెజిల్ , నైజీరియాలతో ద్వైపాక్షిక భేటీ ఉంది. ఇక జీ20 సమావేశాల ముందు మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం మానవ కేంద్రీకృత ప్రపంచీకరణ వైపు పయనించాల్సిన అవసరం ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ.
పూర్తిగా చదవండి..G20 summit: మోదీ బిజీబిజీ.. మూడు రోజుల్లో 15 మంది ప్రపంచ నాయుకులతో ప్రధాని భేటీ!
సెప్టెంబరు 9-10 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న జీ20 సమ్మిట్లో భాగంగా.. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులతో 15కి పైగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 9న ప్రధాని మోదీ యూకే, జపాన్, జర్మనీ, ఇటలీ దేశాల నేతలతో ద్వైపాక్షిక సమావేశాలుండగా.. సెప్టెంబర్ 10 న ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్తో మోదీ లంచ్ మీటింగ్ ఉంటుంది.
Translate this News: