Bharat Mandapam: దేశ రాజధానిలో ఈ వారాంతంలో జరగనున్న జీ20 సమ్మిట్ కోసం ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. న్యూఢిల్లీ ప్రగతి మైదాన్లోని ‘భారత్ మండపం’ అని పిలిచే ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC) కాంప్లెక్స్లో సమ్మిట్ జరుగుతుంది. ఈ ఏడాది జూలై 26న ప్రధాని నరేంద్ర మోదీ ఈ సముదాయాన్ని ప్రారంభించారు. ఇది కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ హాల్స్, యాంఫీ థియేటర్తో సహా అత్యాధునిక సౌకర్యాలను కలిగి ఉంది. భారత మండపంలో 18 టన్నుల బరువున్న 27 అడుగుల ఎత్తైన నటరాజ అష్టధాతువుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు . తమిళనాడులోని స్వామి మలైకి చెందిన ప్రఖ్యాత శిల్పి రాధాకృష్ణన్ స్థపతి మరియు అతని బృందం ఈ శిల్పాన్ని రికార్డు స్థాయిలో ఏడు నెలల్లో పూర్తి చేశారు. ‘భారత మండపం వద్ద ఉన్న అద్భుతమైన నటరాజ విగ్రహం మన గొప్ప చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాలను జీవం పోస్తుంది. ప్రపంచమంతా జీ20 శిఖరాగ్ర సమావేశానికి తరలివస్తుండడంతో ఇది దేశ పురాతన కళాత్మకత, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు ప్రధాని మోదీ.
పూర్తిగా చదవండి..Bharat Mandapam: జీ20 సమావేశాలు జరిగే భారత్ మండపం స్పెషాలిటీ ఏంటి? వైరల్ ఫొటోలు, వీడిమోలు!
ఢిల్లీ సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జీ20 సమ్మిట్కు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అగ్రశ్రేణి ప్రపంచ నాయకులు పాల్గొనే శిఖరాగ్ర సమావేశానికి వేదిక ప్రగతి మైదాన్లోని భారత్ మండపం ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్-కన్వెన్షన్ సెంటర్ . కొత్త ఎగ్జిబిషన్-కమ్-కన్వెన్షన్ సెంటర్ (IECC)ని ప్రధాని నరేంద్ర మోదీ జూలైలో జాతికి అంకితం చేశారు. శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలోని మిగిలిన వేదికలన్నీ ఇన్స్టాలేషన్లు, లైట్లతో అలంకరించి ఉన్నాయి. దాదాపు 123 ఎకరాల క్యాంపస్ ప్రాంతంతో, IECC కాంప్లెక్స్ భారతదేశపు అతిపెద్దది. భారత్ మండపం సుమారు రూ.2,700 కోట్ల పెట్టుబడితో నిర్మించారు.
Translate this News: