Congress PEC Meeting at Gandhi Bhavan : తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కసరత్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే టీపీసీసీ అధ్యక్షుడు, పీఈసీ ఛైర్మన్ రేవంత్రెడ్డి (Revanth Reddy) అధ్యక్షతన.. గాంధీభవన్లో జరిగిన ఎలక్షన్ కమిటీ రెండో సమావేశం ముగిసింది. ఇందులో పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపికపై ఎన్నికల కమిటీ ప్రాథమిక కసరత్తు చేసింది. నియోజకవర్గాల వారీగా ఆశావాహులకు ప్రాధాన్యతా సంఖ్యలు కేటాయించింది. మరోవైపు టికెట్ల కోసం.. ఎన్నికల కమిటీలోని సభ్యులు దరఖాస్తు చేసుకున్నారు. తమకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు సభ్యులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే తొలి ప్రాధాన్యత ఓటు కోసం నేతలు మిగతా వారి మద్దతు కోరుతున్నారు.
పూర్తిగా చదవండి..Congress Special Focus On Telangana: తెలంగాణపై కాంగ్రెస్ హైకమాండ్ స్పెషల్ ఫోకస్
కర్ణాటక ఎన్నికల్లో విజయభేరి మోగించిన కాంగ్రెస్ పార్టీ అదే జోష్లో తెలంగాణలోనూ అధికారం కోసం మరింత ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల ఎంపిక కోసం నేటి నుంచి మూడు రోజుల పాటు స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఈనెల 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో CWC సమావేశం నిర్వహించనున్నట్టుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
Translate this News: