SHARMILA VS TUMMALA over palair ticket: తెలంగాణ కాంగ్రెస్లో పాలేరు వార్ అంతకంతకూ పెరుగుతోంది. పాలేరు టికట్ కోసం వైఎస్ షర్మిల వర్సెస్ తుమ్మల యుద్ధం హాట్ టాపిక్గా మారింది. ఇప్పటివరకు కాంగ్రెస్లో చేరుతున్నట్టు షర్మిల అధికారికంగా ప్రకటించలేదు కానీ.. హస్తం పార్టీలో వైఎస్ఆర్టీపీ విలీనం అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల సోనియా గాంధీని కూడా కలిశారు షర్మిల. మరోవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని కలిశారు టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి(Revanth Reddy). పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అయితే పాలేరు సీటు కావాలని తుమ్మల కోరినట్టు సమాచారం. దీనికి కాంగ్రెస్ కూడా సానుకూలంగా స్పందించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పాలేరు నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే షర్మిల ప్రకటించడంతో.. ఒకవేళ కాంగ్రెస్లో తుమ్మల చేరితే సీటు కోసం ఇద్దరి మధ్య వార్ నడవడం ఖాయంగా కనిపిస్తోంది.
ముహూర్తం ఫిక్స్?
మరోవైపు బీఆర్ఎస్ సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్లో చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఖమ్మం నుంచి భారీఎత్తున సమావేశమై తమపార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. హస్తం పార్టీలో చేరేందుకు తుమ్మల సుముఖంగా ఉన్నారని, పార్టీ కూడా పాలేరులో ఆయనకు టికెట్ కేటాయించేందుకు సిద్ధంగా ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ తొలి జాబితాలో ఖమ్మంలో పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల భంగపాటుకు గురయ్యారు. దీంతో ఈ మాజీ మంత్రి పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇక ఇటీవల ఖమ్మంలో భారీ బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు.
ఎలా సాల్వ్ చేస్తారు?
SHARMILA VS TUMMALA: పాలేరు వార్.. షర్మిల, తుమ్మలలో ఈ సీటు ఎవరికి దక్కనుంది?
తెలంగాణ రాజకీయాల్లో డైనమిక్స్ మారుతున్నాయి. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి, ప్రస్తుత బీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు సిద్ధమవుతున్నట్టు సమాచారం. పాలేరు టికెట్ కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్ కూడా అంగీకరించిందని సమాచారం..మరోవైపు పాలేరు నుంచి పోటి చేస్తానని ఇప్పటికే వైటీపీ అధినేత్రి షర్మిల ప్రకటించగా.. ఆమె కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ ఐనట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఇద్దరిలో ఎవరికి ఈ టికెట్ దక్కుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Translate this News: