Village organisation assistants salaries getting hiked: రక్షా బంధన్ కానుకగా, రాష్ట్రంలోని మహిళా సంఘాల సహాయకు(వీ వో ఏ) ల వేతనాలను పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. సీఎం నిర్ణయం మేరకు వీరి వేతనాలు నెలకు రూ. 8000 కు పెరగనున్నాయి. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 17,608 మంది ఐకేపీ మహిళా సంఘాల సహాయకు ( వీ వో ఏ) లకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. పెంచిన వేతనాలు సెప్టెంబర్ నెల నుంచి అమలులోకి వస్తాయి. వేతన పెంపు ద్వారా ఏడాదికి రూ. 106 కోట్లు ప్రభుత్వ ఖజానా పై అదనపు భారం పడనుంది. ఖర్చుకు వెనకాడకుండా మహిళా సంక్షేమమే ధ్యేయంగా సిఎం మానవీయ కోణంలో వేతన పెంపు నిర్ణయం తీసుకున్నరని అధికారులు పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..వీఓఏలకు సీఎం రక్షాబంధన్ కానుక : సెప్టెంబరు నుంచి పెంచిన వేతనాలు
మహిళా సంఘం సహాయకు ( వీ వో ఏ) లకు ముఖ్యమంత్రి రాఖీ పండుగ కానుక ఇచ్చారు. వారి నెల జీతాలు పెంచుతూ సిఎం నిర్ణయం తీసుకున్నారు. సిఎం కేసీఆర్ నిర్ణయం మేరకు తక్షణమే జీఓ జారీ అయ్యింది.
Translate this News: