పల్లె పల్లెకూ బీజేపీ కార్యక్రమం చెపట్టబోతున్నామని బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపా చారి అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల మధ్యకు వెళ్లి అధికార పార్టీ నాయకుల అవినీతిపై వివరిస్తామన్నారు. మరోవైపు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. నాగర్ కర్నూల్ జిల్లాలో ఎమ్మెల్యే మితిమీరి మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యే అహంకారపూరిత, దౌర్జన్యపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మర్రి జనార్దన్ రెడ్డి డబ్బు, అహకార మదంతో వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.
పూర్తిగా చదవండి..Dilipa Chari: మర్రి జనార్దన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర నాయకులు దిలీపా చారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మర్రి జనార్దన్ రెడ్డి హింసా రాజకీయాలు చేయాలని చూస్తున్నారన్నారు. అతని యాత్రకు ప్రజా స్పందన కరువైందన్న ఆయన.. అందుకే గ్రామాల్లో డప్పు చాటింపు చేయిస్తున్నారని విమర్శించారు.
Translate this News: