కామారెడ్డి ప్రజలు సీఎం కేసీఆర్కు బ్రహ్మరథం పడుతారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండల పరిధిలోని పలు గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ నేతలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్కే ఓటు వేస్తామని మాచారెడ్డి మండల పరిధిలోని గ్రామాలు ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు కవితకు తెలిపారు. దీనికి సంబంధించి తీర్మాన పత్రాలను కవితకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత.. ఎమ్మెల్యే గంపా గోవర్దన్ను అభినందించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కార్యకర్తలు వచ్చి ఏకగ్రీవ తీర్మనాలు చేసి, వాటిని తనకు అందించడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిలో పోటీచేబోతున్నారని కవిత తెలిపారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha: కామారెడ్డిలో కేసీఆర్ విజయం ఖాయం
సీఎం కేసీఆర్ను కామారెడ్డి జిల్లా ప్రజలు ఆధరిస్తారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాలోని మాచారెడ్డి మండల పరిధిలోని ప్రజలు కేసీఆర్కే ఓట్లే వేస్తామని తీర్మానాలు చేయడం సంతోషంగా ఉందన్నారు.
Translate this News: