Rampur Village: బీఆర్ఎస్ (BRS)కే ఓటేస్తామని రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేయడం సంతోషకరమైన విషయమని మంత్రి హరీష్రావు అన్నారు. శనివారం సిద్ధిపేట జిల్లా రాంపూర్ (Siddipeta – Rampur) గ్రామంలో పర్యటించిన మంత్రి.. అక్కడ నిర్వహించిన హరితహారం (Harithaharam) కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రాంపూర్ గ్రామస్థుల తీర్మాన పత్రాలను ఆ గ్రామ సర్పంచ్ మంత్రికి అందించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ (CM KCR) రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్గా నిలిపారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి రాంపూర్ గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారన్నారు. రైతులను ఆదుకుంటున్న కేసీఆర్.. రైతు బాగుంటేనే రాష్ట్రం భాగుంటుందని భావించారన్నారు. అందుకే కేసీఆర్ రైతుబంధు పథకం (RYTHU BANDHU Scheme) తీసుకువచ్చి ఈ పథకం ద్వారా రైతులకు సహాయం చేస్తున్నారన్నారు. రైతులు ప్రమాదంలో మరణిస్తే.. వారి కుటుంబానికి ప్రభుత్వం బీమాను అందిస్తుందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Harish Rao: బీఆర్ఎస్కే ఓటేస్తాం.. రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం
సిద్దిపేట జిల్లా రాంపూర్ గ్రామస్తులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు మాత్రమే ఓటు వేస్తామని తీర్మానం చేశారు. ఈ తీర్మాన పత్రాలను మంత్రి హరీష్ రావుకు అందజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చూసే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.
Translate this News: