MLC Kavitha in Nizamabad: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో బీఆర్ఎస్ (BRS) ఆశీర్వాద ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కలిసి కవిత పాదయాత్ర చేశారు. అనంతరం మాట్లాడిన కవిత రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్లుతోందన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ సర్కార్ రైతులకు రైతుబంధు(RYTHU BANDHU), రైతుబీమా(RYTHU BIMA)తో పాటు వరిధాన్యం కొనుగోళ్లు చేసిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. కాళేశ్వరం జలాలతో రాష్ట్రంలోనే అనేక చెరువులు వేసవికాలంలో సైతం అలుగుపోస్తున్నాయని కవిత వెల్లడించారు.
పూర్తిగా చదవండి..MLC Kavitha:తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆర్మూర్లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆమె.. బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. పార్టీకోసం కష్టపడ్డవారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సూచించారు.
Translate this News: