సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరుతూ జనగామ నియోజకవర్గ బిఅర్ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే.. స్వామిరికి ప్రత్యేక పూజలు చేశారు. తన కోరిక నెరవేరాలని గంగిరేగు చెట్టుకు ముడుపుకట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ముడోసారి జనగామ టికెట్ తనకే రావాలని తాను మల్లికార్జున స్వామిని కోరుకున్నట్లు ముత్తిరెడ్డి తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Muthireddy Yadagiri Reddy: మళ్లీ టికెట్ నాకే వస్తుంది
సీఎం కేసీఆర్ తనకే మూడోసారి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తెలిపారు. మూడోసారి రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. గత 5 ఏళ్లుగా నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు.
Translate this News: