మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోలేదని, ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు పాతవని స్పష్టం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో ఉన్న మృతదేహం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు హరఖ్ అలియాస్ శ్రీకాంత్గా మాజీ మావోయిస్టులు తెలిపారు. మావోయిస్ట్ శ్రీకాంత్ 2012లోనే అనారోగ్యంతో మరణించాడని వెల్లడించారు. మావోయిస్ట్ పార్టీ అప్పటి వీడియోను ఇప్పుడు విడుదల చేసిందని, దీనీ వల్ల మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న అలియాస్ మీసాల సత్తెన్న మృతిచెందాడని మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. దీనిపై మావోయిస్టు పార్టీ ప్రకటప విడుదల చేస్తేనే అసలు విషయం తెలిసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..రాజిరెడ్డి చనిపోలేదు.. అది పాత వీడియో అంటున్న మాజీ మావోలు
మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు
Translate this News: