Pawan Kalyan Janavani Program: ఏపీలో మైనర్ బాలికలే ముఖ్యంగా మిస్ అవుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఈ కిడ్నాప్ వ్యవహారాలపై ఫిర్యాదులు చేస్తే.. విత్ డ్రా చేసుకోవాలని సంబంధిత వ్యక్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. గురువారం విశాఖపట్నంలోని దస్పల్లా హోటల్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ‘జనవాణి’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా బాధితుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకున్నారు. ఈక్రమంలోనే అనకాపల్లి జిల్లాలో బాలిక కిడ్నాప్ పై కుటుంబ సభ్యులు జనవాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీంతో పవన్ కళ్యాణ్.. బాలిక కిడ్నాప్ వివరాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan Janavani Program: బాధితుల మీద దాడి జరిగితే ఊరుకోం.. అండగా ఉంటాం: పవన్
విశాఖ దస్పల్లా హోటల్ లో 'జనవాణి' కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఇందులో భాగంగా పవన్ ఉత్తరాంధ్ర ప్రజలతో మాట్లాడుతున్నారు. గ్రామంలో వారికి ఉన్న సమస్యలు, ఇబ్బందులు తెలుసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.
Translate this News: