పాక్ దూషణపై జరన్వాలాలో మూకుమ్మడి చర్చిలు ధ్వంసం చేసిన దోషులపై చర్యలు తీసుకోవాలని ఆ దేశ ప్రధాని ఆదేశించారు. బుధవారం పాకిస్థాన్లోని ఫైసలాబాద్లో దైవదూషణ ఆరోపణలపై ఓ వర్గం దాడిచేసింది. అనంతరం చర్చి ఆస్తులకు నిప్పు పెట్టారు. ఒక క్రైస్తవ వ్యక్తి, అతని సోదరి ఖురాన్ను అపవిత్రం చేసి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఈ దాడులకు పాల్పడిపనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. క్రిస్టియన్ కమ్యూనిటీని ఓ వర్గం ముట్టడించినట్లు సమాచారం. ఇస్లాం యొక్క పవిత్ర గ్రంథాన్ని అపవిత్రం చేశారనే నెపంతో పాకిస్తాన్లోని జరన్వాలాలో ఐదు చర్చిలను ధ్వంసం చేశారు. ఈ ఘటనా నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పారామిలటరీ బలగాలు మోహరించాయి. ప్రాంతీయ రాజధాని లాహోర్కు 130 కి.మీ దూరంలో పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్ జిల్లాకు చెందిన చమ్రా మండి జరన్వాలాలో నివసిస్తున్న క్రైస్తవ సమాజాన్ని రక్షించడానికి పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్లను పిలిపించారు.
పూర్తిగా చదవండి..పాకిస్తాన్లో చర్చిపై దుండగుల దాడి, అప్రమత్తమైన పోలీసులు
పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో చర్చిని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఆ చర్చి పరిసర ప్రాంతాల్లోని క్రైస్తవులు నివసించే ప్రాంతాల్లో లూటీలకు తెగబడ్డారు. క్రైస్తవ మతస్తుడు ఇస్లాం దైవదూషణకు పాల్పడ్డారనే నెపంతో గుర్తుతెలియని వ్యక్తులు ఈ విధ్వంసానికి పూనుకున్నారని తెలిపారు. దీంతో అక్కడ పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ రేంజర్లు రంగంలోకి దిగాయి.
Translate this News: