వచ్చే శని, ఆదివారాలలో మంజీరా నీటి సరఫరా ఫేజ్-2 పైప్ లైన్ల మరమ్మతుల కారణంగా నగరంలో పలు చోట్ల తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. శనివారం ఉదయం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు అంతరాయం కలగనున్నట్లు జీహెచ్ఎంసీ సిబ్బంది తెలిపారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (HMWSSB) మరమ్మతులు చేపట్టనుంది. దీనికారణంగా పలు ప్రాంతాల్లో వాటర్ సప్లై నిలిపివేస్తున్నట్లు తెలిపింది.దీంతో సదరు కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..భాగ్యనగరవాసులకు అలర్ట్! ఆ ఏరియాలో డ్రింకింగ్ వాటర్ బంద్
భాగ్యనగరంలో ఉండేవారికి జీహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. వచ్చే శనివారం (19-08-2023) ఉదయం నుండి ఆదివారం (20-08-2023) మధ్యాహ్నం వరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. మంజీరా నీటి సరఫరా ఫేజ్-2లో మరమ్మతుల కారణంగా నగరంలోని కూకట్పల్లి, లింగంపల్లి, జగద్గిరిగుట్ట, అమీర్పేటతో సహా పలుచోట్ల అంతరాయం ఏర్పడుతుందని తెలిపారు. కాబట్టి దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరు నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని అధికారులు కోరారు.
Translate this News: