మందబలం చూసి కుక్క మొరిగినట్లు అనే సామెత గుర్తుందిగా..అయితే ఇక్కడ తమ గుంపును చూసుకొని ఒక కొండముచ్చు ఏకంగా చిరుతపులిపై ఖయ్యానికి కాలు దువ్వింది.వెంటనే బాబూన్లన్ని కలిసి చిరుతపై అటాక్ చేయడంతో బతుకు జీవుడా అంటూ చిరుత పరుగులు తీసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికాలో ఓ అటవి ప్రాంతంలో చోటుచేసుకుంది.అడవి దారి గుండా ఉన్న రహదారిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను ఓ వ్యక్తి తన మొబైల్లో బంధించాడు.దాదాపు 50కి పైగా ఉన్నా బబూన్స్ సంఘటితంగా దాడిచేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ వీడియోలో రోడ్డులో స్వల్పపాటి ట్రాఫిక్ జామ్ అయినట్లు స్పష్టంగా తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..పట్టపగలే చిరుతకు చుక్కలు చూపించిన బబూన్స్
ఐక్యమత్యమే మహాబలం అని ఈ బాబూన్లు మరోసారి రుజువు చేశాయి. ఆకలి తీర్చుకుందామని దాడిచేసిన చిరుతపై అటాక్ చేశాయి. అంతేకాదు ఆ చిరుతకే ముచ్చెమటలు పట్టించి పట్టపగలే చుక్కలు చూపించాయి. బతుకు జీవుడా అంటూ అడవిలోకి పరుగులు తీసిన దృష్యాలు ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
Translate this News: