భాగ్యనగరంలో వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ఎన్నో ఫ్లై ఓవర్ నిర్మాణాలు జరిగాయి. అయితే ఇందిరా పార్క్ – విఎస్టి మధ్య ఉక్కు ఫ్లైఓవర్ చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రజల చిరకాల కోరిక తీరనుంది. అందులో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రత్యేకమని చెప్పాలి. దీని వ్యయం రూ.450 కోట్లు. 2.6 కిలోమీటర్ల మేర నిర్మించిన అతిపెద్ద ఉక్కు వంతెన ఇది. ఈ వంతెన పనులు ఇటీవల పూర్తికావడంతో లోడ్ టెస్టు నిర్వహిస్తున్నారు. లోడ్ టెస్ట్ పూర్తి కాగానే ఈ నిర్మాణం నగర ప్రజలకు అందుబాటులోకి రానుంది.
పూర్తిగా చదవండి..భాగ్యనగరంలో మరో మణిహారం, ప్రారంభానికి సిద్ధమైన స్టీల్ బ్రిడ్జి ఫ్లైఓవర్
విశాలమైన రోడ్లతో, ప్లై ఓవర్ బ్రిడ్జీలతో హైదరాబాద్ మహానగరం దినాదినాభివృద్ధి చెందుతుంది. అలా నగర సిగలో ఎన్నో కట్టడాలు అబ్బురపరుస్తున్నాయి. ఓ పక్క నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్, మరోపక్క అంబేద్కర్ విగ్రహం. తాజాగా ఇదే కోవలోకి మరో మణిహారం అయినటువంటి ఇందిరాపార్కు - వీఎస్టీ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం వచ్చి చేరింది. ఈ కట్టడం హైదరాబాద్కే తలమానికంగా నిలువనుంది.
Translate this News: