Dharmapuri Arvind: బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్వకుంట్ల కుటుంబం అంటేనే దొంగల కుటుంబమని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర అసలైన ఉద్యమకారుడు ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్(CM KCR) తన 9 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో సమస్యలు పెరిగాయన్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో ఎలుకలు, కుక్కలు సైర్య విహారం చేస్తున్నాయన్న ఎంపీ.. ప్రభుత్వం ఆస్పత్రిని పట్టించుకోకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్నారు. కేసీఆర్ ట్యాంక్ బండ్ నీటిని శుద్ధి చేస్తామన్నారని, రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం, అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామి ఇచ్చినట్లు గుర్తు చేసిన అర్వింద్.. హామీలను ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Dharmapuri Arvind: కేసీఆర్ను నేనే కంట్రోల్ చేశా.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.
Translate this News: