YS Sharmila: వివేకాను హత్య చేసిన వారికి టికెట్.. జగనన్న మారిపోయాడు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు

కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే జగన్ సీట్ ఇచ్చాడని ఫైర్ అయ్యారు APCC చీఫ్ వైఎస్ షర్మిల. కడప కాంగ్రెస్ MP అభ్యర్థిగా తాను నిలబడుతున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయం తనకు సులువైంది కాదని తప్పని సరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నానని వెల్లడించారు.

YS Sharmila: వివేకాను హత్య చేసిన వారికి టికెట్.. జగనన్న మారిపోయాడు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
New Update

YS Sharmila: కడప కాంగ్రెస్ MP అభ్యర్థి గా తాను నీలబడుతున్నట్లు తెలిపారు APCC చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి. YSR బిడ్డ నిలబడుతుందన్నారు.  అయితే ఈ నిర్ణయం తనకు సులువైంది కాదని.. తన కుటుంబాన్ని చీలుస్తుందని తెలుసన్నారు. వైఎస్సార్ అభిమానులను గందరగోళంలో పడేలా చేస్తుందని అయినా తప్పని సరి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 ఇదే తట్టుకోలేకపోయా..

షర్మిల మాట్లాడుతూ.. 'జగన్ మోహన్ రెడ్డి నా ఆన్న. ఆన్న అంటే నాకు ద్వేషం లేదు. జగన్ మోహన్ రెడ్డి నా రక్తం. ఎన్నికల్లో నన్ను చెల్లే కాదు బిడ్డ అన్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక మనిషి మారిపోయాడు. ఈ జగన్ మోహన్ రెడ్డి నాకు పరిచయం లేదు. సీఎం జగన్ నా అనుకున్న వాళ్ళను అందరినీ నాశనం చేశాడు.  హత్యా రాజకీయాలను ప్రోత్సహించాడు. కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకాను హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇచ్చాడు.  ఇదే తట్టుకోలేక పోయా..హత్య చేసిన వాళ్లకు శిక్ష లేదు..హత్య చేసిన వాళ్ళు, చేయించిన వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు. అన్ని సాక్ష్యాలు ఉన్నా చర్యలు లేవు..అధికారం వాడుకొని వాళ్ళనే జగన్ రక్షిస్తున్నాడు. అవినాష్ రెడ్డిని వెనకేసుకు వస్తున్నాడు. మళ్ళీ అవినాష్ రెడ్డికి సీట్ ఇవ్వడం తట్టుకోలేక పోయా.

Also Read: జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..!

రాజకీయాలకు విరుద్ధం..

వైసీపీ ప్రభుత్వం రక్తంలో మునిగిపోయింది. వివేకా హత్యను రాజకీయం కోసం వాడుకున్నారు. మాకు చాలా ఆలస్యంగా అర్థం అయింది. జగన్ చానెల్ తప్పుడు కథనాలు ప్రసారం చేసింది. ప్రజలు హత్య చేసిన వాళ్ళకే సీట్ ఇస్తే హర్షించరు అని తెలిసి మళ్ళీ టిక్కెట్ ఇచ్చారు. వైఎస్సార్, వివేకా రామ లక్ష్మణుడిలా ఉండేవాళ్ళు.. వివేకా ఆకరి కోరిక నన్ను ఎంపీగా చూడాలని..అప్పుడు నాకు అర్థం కాలేదు నన్ను ఎందుకు ఎంపీగా ఉండమని అడిగారో ఇవ్వాళ అర్థం అయ్యింది. సునీత న్యాయం కోసం గడప గడపకి తిరుగుతుంది. న్యాయం కోసం ఎక్కని మెట్టు లేదు. నేను హత్యా రాజకీయాలకు విరుద్ధం. ఒక హంతకుడు పార్లమెంట్ మెట్టు ఎక్కకూడదని ఈ నిర్ణయం తీసుకున్న. ఒక్క అవకాశం అని చెప్పి రాష్ట్రాన్ని ముంచారు. రాజన్న రాజ్యం అని చెప్పి రాక్షస రాజ్యం తెచ్చాడు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు. మద్యం ఏరులై పాలించాడు.

అధికారంలో రావాలి..

ఈ నెల 5 నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభం అవుతుంది. ఇవ్వాళ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి వారి ఆశీస్సులు తీసుకున్నాం. నాన్న ఆశయం కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరా. కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయడానికి అందరం సిద్ధంగా ఉన్నాం. ఇవ్వాళ 5 మంది ఎంపీలు, 114 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశాం. మరో రెండు, మూడు రోజుల్లో తుది జాబితా సైతం విడుదల అవుతుంది. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి జగన్, బాబు ఏనాడూ పని చేయలేదు.  ఒక్క ఉద్యమం చేసింది లేదు. ప్రత్యేక హోదా వచ్చి ఉంటే రాష్ట్రం ఎప్పుడో బాగుపడేది. రాష్ట్రం ఇవ్వాళ దీన స్థితిలో ఉంది. దీనికి కారణం బాబు, జగన్. విభజన హామీలు ఒక్కటి అమలు కాలేదు. రాష్ట్రం అభివృద్ది చెందాలి అంటే కాంగ్రెస్ అధికారంలో రావాలి. విభజన హామీలు నెరవేరాలి అంటే కాంగ్రెస్ రావాలి' అని వ్యాఖ్యానించారు.

#ys-sharmila
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి