YS Jagan Delhi Tour : వైసీపీ (YCP) అధినేత వైఎస్ జగన్ మరి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. మూడు రోజుల పాటు జగన్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు సమాచారం. ఏపీ (Andhra Pradesh) లో వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులకు నిరసనగా రేపు జగన్ ఢిల్లీలో ధర్నా నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే జగన్ ప్రధానమంత్రి,హోంమత్రి, రాష్ట్రపతిని కలవనున్నారు.
ఇప్పటికే కేంద్రమంత్రులను కలిసేందుకు జగన్ అపాయింట్మెంట్ కోరినట్లు తెలుస్తుంది. ఢిల్లీకి ప్రత్యేక విమానంలో జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వెళ్లనున్నారు. ఇప్పటికే గవర్నర్ ను కలిసిన జగన్ ఆయనకు ఫిర్యాదు చేశారు.