హ్యాపీ బర్త్‌డే నేషనల్‌ క్రష్ స్మృతి మంధాన..!!

By Bhoomi

స్మృతి శ్రీనివాస్ మంధాన టాప్ రేటింగ్ ఉన్న భారత క్రికెటర్లలో ఒకరు. ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆమె కెరీర్‌ను ప్రారంభించింది. 

బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బిసిసిఐ) ఆమెను ఎంపిక చేసినప్పుడు స్టార్ క్రికెటర్ 2018లో జాతీయ మహిళా క్రికెట్ జట్టులోకి ప్రవేశించింది.

నేడు 27వ వసంతంలోకి అడుగుపెడుతున్న స్మృతి మంధాన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. 

 ముంబైలో జన్మించిన స్మృతి.. సోదరుడు, శ్రవణ్ క్రికెట్ ఆడేందుకు ప్రేరణ. ఆమె తండ్రి శ్రీ శ్రీనివాస్ సాంగ్లీకి జిల్లా స్థాయి క్రికెట్ క్రీడాకారుడు. తన కుటుంబం సపోర్టుతో క్రికెట్ వరల్డ్‌లో తన స్థానాన్ని ఏర్పరుచుకుంది.

 11 ఏళ్ల వయసులో తన మొదటి మ్యాచ్ ఆడింది. స్మృతి అండర్-15 క్రికెట్ జట్టుకు ఎంపికైంది. 

ప్రపంచ T20 కప్ 2014కు హాజరు కావాల్సింది. 12 వ బోర్డ్ ఎగ్జామ్స్ కారణంగా హాజరుకాలేదు. ఇంగ్లాండ్ టూర్‌కు వెళ్లవలసి ఉన్నందున కాలేజీలో అడ్మిషన్ పొందే అవకాశాన్ని కోల్పోయింది.

గుజరాత్‌లో జరిగిన వన్-డేలో కబర్చిన అత్యుత్తమ ప్రదర్శన క్రికెట్ ప్రపంచంలో సెన్షెషనల్ క్రియేట్ చేసింది.   వడోదర వేదికగా అండర్-19 టోర్నీలో 150 బంతుల్లో 224 పరుగులు చేసి దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది.

ఓవల్‌లోని బెల్లెరివ్‌లో జరిగిన రెండో వన్డేలో స్మృతి మంధాన 109 బంతుల్లో 102 పరుగులు చేసింది. 2016 ఐసిసి మహిళల రేటింగ్స్‌లో జాబితా చేయబడిన ఏకైక భారతీయ క్రీడాకారిణి ఆమె.

తన అద్భుతమైన ఆటతో అందరినీ ఆకట్టుకుంది .  2018లో అర్జున అవార్డుతో సత్కరించింది ప్రభుత్వం.

స్టార్ మహిళా క్రికెటర్ 2018లో కియా సూపర్ లీగ్‌కు సైన్ అప్ చేసి, అలా చేసిన మొదటి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. 

వెస్టిండీస్ టోర్నమెంట్‌లో 1000 పరుగులు చేసింది. ఆమె అద్భుతమైన ప్రదర్శన మహిళల ODI లో 66.90 సగటుతో అత్యధిక పరుగుల స్కోరర్ గా నిలిచింది. 

ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఫెలిసిటేషన్ ఫంక్షన్‌లో 2019 సంవత్సరానికి ఇంటర్నేషనల్ ఉమెన్ క్రికెటర్ అవార్డును గెలుచుకుంది.