కొబ్బరి పాలు, నిమ్మరసం కలిపి పేస్ట్ లా వేసుకుని 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మెరుస్తుంది.
By
ముల్తాని మట్టి, తేనే కలుపుకుని ముఖానికి రాసుకొని తరువాత శుభ్రం చేసుకోవాలి.
విటమిన్ ఇ ఎక్కువగా తీసుకుంటే..చర్మ చాలా కాంతి వంతంగా ఉంటుంది.
ములక్కాయ, ఆవాల నూనె, బాదం, పాలకూర, ఆనపకాయ, కివీ, టొమాటో, బ్రోకలీలో విటమిన్ ఇ పుష్కలంగా లభిస్తుంది.
చల్లని నీరు, చల్లని పదార్థాలు ముఖాన్ని కాంతివంతంగా ఉంచడానికి సహాయపడతాయి.
ముఖాన్ని వేడి పాలతో ఆవిరి పట్టడం వల్ల ముఖం ఎప్పుడూ ఫ్రెష్ గా ఉంటుంది.
శనగపిండి, రోజ్ వాటర్, పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకోవాలి. దీని వలన మంచి ఫలితం ఉంటుంది.
పాలు, రోజ్ వాటర్, నిమ్మరసం బాగా కలిపి దూదితో ముఖానికి ఆప్లై చేసుకుని తరువాత కడుక్కోవాలి.
ప్రతిరోజూ 4 నుండి 6 లీటర్ల నీటిని తాగాలి