రచ్చ రచ్చే.. రూ.2వేలకే 5జీ స్మార్ట్ ఫోన్.. ఆఫర్లు అదుర్స్..!
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో తన సరసమైన స్మార్ట్ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది.
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో తన సరసమైన స్మార్ట్ఫోన్ Oppo K13x 5G ని విడుదల చేసింది.
ఈ ఫోన్పై ప్లిప్కార్ట్లో బంపరాఫర్ అందుబాటులో ఉంది.
4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర ఫ్లిప్కార్ట్లో రూ.15,999గా ఉంది.
ఇప్పుడు కేవలం రూ.11,999లకే లిస్ట్ అయింది. అంటే రూ.4వేల తగ్గింపు లభిస్తుందన్నమాట.
అలాగే HDFC బ్యాంక్ కార్డ్ చెల్లింపుపై మరో రూ.1500 తగ్గింపు పొందవచ్చు.
ఈ తగ్గింపు తర్వాత Oppo K13x 5G రూ.10,499కి అందుబాటులో ఉంటుంది.
దీనితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందొచ్చు. పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.8,350 వరకు ఆదా చేసుకోవచ్చు.
ఈ ఆఫర్ మొత్తం వర్తిస్తే మీరు Oppo K13x 5G ఫోన్ను కేవలం రూ.2,149లకే కొనుక్కోవచ్చు.
అయితే ఈ ఆఫర్ మొత్తం పొందాలంటే.. పాత ఫోన్ కండీషన్ మెరుగ్గా ఉండాలి. ఎలాంటి డ్యామేజ్ ఉండకూడదు.