కాశీ విశ్వనాథుని సేవలో మోదీ

కాశీలో హర్ హర్ మహాదేవ్ నినాదంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

28 కిలోమీటర్ల మేర సాగిన ర్యాలీలో మోదీపై పూలవర్షం కురిపించారు ప్రజలు.

మహాశివరాత్రి రెండో రోజు జాగరణలో భాగంగా పుష్పాలు, బిల్వపత్రాలను స్వామివారికి సమర్పించారు.

గర్భగుడిలో కూర్చుని అభిషేకం చేశారు.

పుష్పకిరీటాన్ని ధరించారు.కాశీలోని జిఐ క్రాఫ్ట్ మెటల్ రిపోజిటరీ నుంచి నాలుగు అడుగుల పొడవున్న త్రిశూలాన్ని ముఖ్యమంత్రి ప్రధానికి బహూకరించారు.

శివునికి సంబంధించిన చిహ్నాలైన పాము,దమ్రుతో అలంకరించి చెక్కిన త్రిశూలాన్ని ప్రధాని గౌరవంతో స్వీకరించారు