బైక్ మైలేజ్ పెరగాలంటే ఈ 5 టిప్స్ కచ్చితంగా పాటించాల్సిందే..!
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు.
చాలా మందికి బైక్ ఎలా వాడాలి?.. మైలేజ్ పెరగాలంటే ఏం చేయాలి? అనే విషయాలు తెలియదు.
అలా తెలియక తమ బైక్ను షెడ్డుకు పంపిస్తున్నారు. అక్కడ వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు.
కేవలం 5 చిట్కాలు పాటిస్తే మీ బైక్ను షెడ్డుకు తీసుకెళ్లకుండా మైలేజ్ను పెంచుకోవచ్చు.
ఇంజిన్ ఆయిల్ను క్రమం తప్పకుండా మార్చాలి.
ఎయిర్ ఫిల్టర్ను క్లీన్గా ఉంచాలి. ఎందుకంటే మురికిగా ఉన్న ఫిల్టర్ ఇంజిన్.. ఎక్కువ పెట్రోల్ వినియోగిస్తుంది.
స్పార్క్ ప్లగ్లను ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా చెక్ చేయాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చాలి.
టైర్లపై ప్రెజర్ వల్ల కూడా మైలేజ్ దెబ్బతింటుంది. అందువల్ల బైక్ నడిపేముందు టైర్లలో గాలి సరిపడా ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి.
గాలి తక్కువగా ఉన్న టైర్లు ఎక్కువ ఘర్షణను సృష్టిస్తాయి. అది కాస్త ఇంజిన్పై ప్రభావం చూపుతుంది.
అప్పుడు ఇంజిన్ మరింత కష్టపడి పనిచేయడానికి ఎక్స్ట్రా పెట్రోల్ను యూజ్ చేసుకుంటుంది.
సరైన డ్రైవింగ్ టెక్నిక్ పాటిస్తే.. బైక్ మైలేజీని పెంచుకోవచ్చు. తక్కువ వేగంతో డ్రైవ్ చేయాలి. సరైన సమయంలో గేర్లను మార్చాలి.
క్వాలిటీ గల పెట్రోల్నే వాడాలి. లేదంటే అది ఇంజిన్ పనితీరును తగ్గించి పెట్రోల్ వినియోగాన్ని పెంచుతుంది.
దీనివల్ల మైలేజ్ తగ్గుతుంది. కాబట్టి తరచూ బ్రాండెడ్ కంపెనీ బంక్లలో మాత్రమే పెట్రోల్ కొట్టించాలి.
మోటార్ సైకిల్ పై అధిక బరువును తీసుకెళ్లడం వల్ల ఇంజిన్ పై ఒత్తిడి పెరుగుతుంది. దీని వలన మైలేజ్ తగ్గుతుంది.