'బేబీ' ఫేమ్ ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా మరోసారి స్క్రీన్ పై సందడి చేయబోతున్నారు.

నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

'#90's: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్' ఫేమ్ ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.

ఈరోజు పూజ కార్యక్రమాలతో సినిమాను గ్రాండ్ గా అనౌన్స్ చేశారు.

ఈ కార్యక్రమానికి రష్మిక, నిర్మాత నాగవంశీ, డైరెక్టర్ వెంకీ అట్లూరీ, శివాజీ, కళ్యాణ్ శంకర్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

రష్మిక సినిమాకు క్లాప్ కొట్టి ప్రారంభించగా.. శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

జూన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపారు.

ఈ పూజ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ' ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికీ తెలుసు.

ఇప్పుడు మరో సారి వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుండడం ప్రేక్షకులలో ఆసక్తిని కలిగిస్తోంది.