Hyderabad: హైదరాబాద్ బేగంపేటలో భారీగా ట్రాఫిక్జామ్ అయింది. బేగంపేట ప్లై ఓవర్పై యాక్సిడెంట్ జరగడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బైక్ను వెనుక నుంచి ఓ స్కూల్ బస్సు ఢీ కొట్టడంతో ప్రమాదంలో అక్కడికక్కడే ఓ యువతి మృతి చెందింది. యువతి తండ్రికి సైతం తీవ్ర గాయాలు అయ్యాయి.
Also Read: సంచలనంగా కోల్కతా డాక్టర్ కేసు.. కీలకంగా మారిన సీసీ ఫుటేజ్.. ఆ 29 నిమిషాల్లోనే…
యాక్సిడెంట్ జరగడంతో రెండు గంటలుగా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా సంఘటన స్థలంకు చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితులను ఆసుపత్రికి తరలించారు.