Devi Sri Prasad: న్యూయార్క్ నస్సావ్ వెటరన్స్ కొలస్సియంలో ఇటీవలే జరిగిన ప్రవాస భారతీయుల సదస్సు వేడుకలో టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ తన సంగీత ప్రదర్శన ఇచ్చారు. దేవితో పాటు ఈ వేడుకలో పై 382 మంది జాతీయ, అంతర్జాతీయ కళాకారులు ప్రదర్శమిచ్చారు. 117 మంది కళాకారులూ తమ అద్భుతమైన కళా ప్రదర్శనలతో ప్రతినిధులకు స్వాగతం పలికారు. డీఎస్పీ శ్రీవల్లి పాటతో ఆహుతులను ఉర్రూతలూగించారు. ఆ తర్వాత దేవి ‘హర్ ఘర్ తిరంగా’ పాటను ఆలపిస్తూ .. భారత ప్రధాని నరేంద్ర మోదీని వేదిక పైకి ఆహ్వానించారు. అనంతరం మోదీ సంక్షంలోనే పాటను కొనసాగించారు. దేవి పాటకు ఫిదా అయిన మోదీ ప్రేమగా DSP ని ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
మోదీ ముందు దేవి శ్రీ ప్రసాద్ పాట