Road accident: బస్సు, బైక్ ఢీ..రెండు దగ్ధం..ఒకరి మృతి!

నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును బైక్ ఢీ కొట్టింది.ఈ ఘటనలో బైక్ తో పాటు బస్సు కూడా కాలి బూడిదైంది. దీంతో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

Road accident: బస్సు, బైక్ ఢీ..రెండు దగ్ధం..ఒకరి మృతి!
New Update

Road accident: నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బస్సును బైక్ ఢీ కొట్టింది.ఈ ఘటనలో బైక్ తో పాటు బస్సు కూడా కాలి బూడిదైంది. దీంతో పాటు బైక్ పై ఉన్న వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శామీర్ పేట్ జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

 

ఇక వివరాల్లోకి వెళితే..!

సిద్దిపేట జిల్లా ధమారకుంట వరదరాశిపేటకు చెందిన 26 ఏళ్ళ సంపత్ అనే వ్యక్తి యూజె ఫార్ములా కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం సుమారు ఐదున్నర, ఆరుగంటల ప్రాంతంలో డ్యూటీ నిమిత్తం బైక్ పై వెళ్తుండగా కొల్తూరు గ్రామ పంచాయితీ పరిధిలోని హై వే పై తుర్కపల్లి నుంచి ఎదురుగా వస్తున్న కర్కపట్ల ఫార్మా కంపెనీ బస్సు టూ వీలర్ ను ఢీ కొట్టింది.

దీంతో బైక్ పై నుంచి ఎగిరిపడ్డ సంపత్ స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ క్రమంలో బైక్, బస్సు రెండు ఢీ కొట్టడంతో ఒక్కసారిగా టూ వీలర్ నుంచి మంటలు చెలరేగాయి. అవి కాస్త బస్సుకు కూడా అంటుకున్నాయి. దీంతో బస్సులో ఉన్న వాళ్లందరూ కిందికి దిగి పరుగులు పెట్టారు. కాగా, ఆ మంటల్లో బస్సు ఇంకా బైక్ రెండు కూడా కాలి బూడిదయ్యాయి. ఇక స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి.. సంపత్ మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి